03-09-2023, 06:13 PM
(This post was last modified: 03-09-2023, 06:19 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
(01-09-2023, 03:12 PM)Uday Wrote: ఆ మద్యలో ఏప్పుడో చూసిన గుర్తు, తరువాత్తరువాత మెల్లగా మరుగున పడిపోయింది ఈ కథ నా మెమరీ నుంచి. మళ్ళీ ఇన్ని రోజులకు చూడటం, చదవడం కుదిరింది. చాలా కుతూహలంగా, ఉత్సుకతగా వుంది చదువుతుంటే. భూమిలోకి సొరంగం తవ్వుతుంటే కేకలు, ఏడుపులు వినిపించాయని కూడా ఎప్పుడో చదివిన గుర్తు, ఇప్పుడు మళ్ళీ చైనా వాడు తవ్వబోతున్నాడంటా, చూద్దాం ఏం దొరకుతుందో.మిత్రమా
పోతే నాకున్న కొన్ని సందేహాలను అడగొచ్చు అనుకుంటా. ఈ మద్య కూన్ని ఆర్టికల్స్, అదేవిదంగా కోరాలో అడిగే సందేహాలకు ఇచ్చిన, వచ్చిన జవాబులను బట్టి "ఆకాలంలో ఉన్న మహిమలూ, మహోన్వితమైన అస్త్రశస్త్రాలు, ప్రయోగ వుపసః హారక మంత్రాలు ఆ కాలం వాళ్ళకు మాత్రమే వుపయోగిస్తాయని, ఈ కాలం వాళ్ళకు వాటిని భరించే యోగ్యతగాని, నిష్టత గాని లేవని, అందుకే అవి కాలక్రమంలో మరుగున పడిపోయాయని " వుంది. అటువంటప్పుడు ఆకాలంలో రాసిన ఆచమ[b]న మంత్రాలు, వేదాలు ఈ కాలంలో కూడా ఎలా / ఎందుకు పాటించాలి. కాలమనేది నిరంతరం మార్పు చెందుతూ వుంటుందికదా, మరి అప్పుడు చెప్పినవి ఇప్పుడేలా అన్వయించుకోవాలి. [/b]
మీరడిగిన ప్రశ్న భేషుగ్గా ఉంది. కాకపోతే అప్పటి మంత్రాలు, అస్తశస్త్రాలు ఈ కాలంలో ఉపయోగపడతాయా అంటే ఔననే చెప్పాలి. ఇప్పటి అణ్వస్తాలు మన పురాణాల్లో చెప్పబడిన బ్రహ్మ, నారాయణ, త్రిపురాంతక, బ్రహ్మశిరో నామాస్త్రాలు ఇపుడు అటమిక్, హైడ్రోజెన్, ప్రోటాన్ బాంబులుగా అనుకోవచ్చును. అలాగే పుష్పక విమానం మన ప్రస్తుత విమానం అనుకోవచ్చును.
అలాగే మన మంత్రాల వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తిరోగమిస్తున్నాయని, సాధారణ ఆరోగ్యం వృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు, ఉదాహరణకు ఓంకారం, ధ్యానం, యోగ.
ఇపుడు వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తూ ఫలితాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.
మనం లోతుగా అలోచిస్తే వాటి ప్రయోజనాలు విదిశమౌతాయి.
ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ